Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 1

       
                                                 ఆఖరి వీడ్కోలు

                                                              -  పోల్కంపల్లి శాంతాదేవి
  
                                             
    "స్వప్నా! దేవీ బాగ్ లో... అయిదున్నరకు ఉంటాను."

    ఈ మాట గాలిలో వదిలి జవాబు కోసం చూడకుండా స్కూటర్ మీద దూసుకుపోయాడతను.

    స్కూటర్ చప్పుడుతో వినిపించిన ఆ మాట స్వప్నను విభ్రాంతిలో ముంచింది. ఎవరైనా విన్నారేమోనని చుట్టూ కలియజూసింది, బెదురు చూపులతో.

    స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఇళ్ళకు వెళ్లిపోతున్నారు. టీచర్చు జంటలుగా మాట్లాడుకొంటూ నడుస్తున్నారు.

    రోజు తనతో వచ్చే మధుర టీచర్ ఈ రోజు సెలవు పెట్టడం వల్ల తను బ్రతికిపోయింది గాని......

    అయినా ఇతడికి తన పేరు ఎలా తెలుసు?

    తెలిసినా తనను దేవిబాగ్ లో కలుసుకొమ్మనేంత ధైర్యం ఎలా కలిగింది?

    స్వప్నకి కలిగిన విస్మయం అంతా ఇంతా కాదు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS