రెస్టారెంట్లో.. వాళ్ళిద్దరి ముద్దుల్లో తడిసిన రష్మీ!
on Aug 3, 2021
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని సామెత. అలాగే, ఓ చూరు కింద రెండు కొప్పులకు పడదని మన పెద్దలు అంటుంటారు. కాని 'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ మాత్రం తోటి యాంకర్లతో కలుపుగోలుగా ఉంటూ ముందుకు వెళ్తోంది. 'జబర్దస్త్' యాంకర్ అనసూయతో ఆమెకు పడదని గుసగుసలు వినిపిస్తుంటాయి. కాని వాళ్ళిద్దరూ అటువంటిది ఏమీ లేదంటూ పలుమార్లు చెప్పారు. అలాగే, డాన్స్ రియాలిటీ షో 'ఢీ 12'లో తోటి యాంకర్ వర్షిణి, 'ఢీ 13'కి కొత్తగా వచ్చిన యాంకర్ దీపికా పిల్లితో రష్మీ గౌతమ్ గుడ్ రిలేషన్ మైంటైన్ చేస్తోంది.
రష్మీ గౌతమ్, వర్షిణీ సౌందర్రాజన్, దీపికా పిల్లి... లేటెస్టుగా ముగ్గురూ కలిశారు. ఒక రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడ రష్మీని వర్షిణి, దీపిక ముద్దుల్లో ముంచెత్తారు. 'రష్.. నువ్వు నా క్రష్' అంటూ వర్షిణి రైమింగ్ తో పోస్ట్ చేశారు. రష్మీ, వర్షిణి తనకు గర్ల్ ఫ్రెండ్స్ అని దీపిక పోస్ట్ చేశారు. మొత్తం మీద ఈ ముగ్గురి కలయిక బుల్లితెర ప్రేక్షకులకు కనువిందుగా నిలిచింది.
ప్రస్తుతం ఈటీవీలో వర్షిణి షోస్ చేయడం లేదు. స్టార్ మా ప్రోగ్రామ్స్ తో సెటిల్ అయింది. రష్మి ఈటీవీ షోస్ 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ'తో పాటు మధ్య మధ్యలో జీ తెలుగులో ఈవెంట్స్ కూడా చేస్తుంది.
Also Read