'బిగ్ బాస్ 5'కు భార్యతో రమ్మన్నా ఓకే.. ఒక్కడినే రమ్మన్నా ఓకే!
on Aug 3, 2021
చైనా కంపెనీకి చెందిన 'టిక్ టాక్' యాప్పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, ఆ యాప్ కొంత మందికి మేలు జరిగింది. అందులో దుర్గారావు దంపతులు ఖచ్చితంగా ఉంటారు. తొలుత 'టిక్ టాక్' ద్వారా వారిద్దరూ ప్రజలకు వినోదం అందించేవారు. తర్వాత వాళ్లను చాలామంది టీవీ షోలను ఆహ్వానించడం మొదలుపెట్టారు. బుల్లితెరపై కూడా దుర్గారావు దంపతులకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.
అందువల్ల, వారిద్దరిని 'బిగ్ బాస్' రియాల్టీ షోలోకి తీసుకోవడానికి స్టార్ మా ఛానల్, షో నిర్వాహకులు ఆలోచిస్తున్నాట. దీనిపై దుర్గారావు స్పందించాడు. బిగ్ బాస్ గురించి తనకు ఒకరు ఫోన్ చేశారని చెప్పాడు. 'బిగ్ బాస్'లో పాల్గొనే అవకాశం వస్తే మీరు పెళతారా? అని దుర్గారావును ప్రశ్నించగా... "తప్పకుండా వెళతాను" అని అతడు సమాధానమిచ్చాడు.
అయితే ఇదివరకు భార్యతో కలిసి రమ్మంటేనే వెళతానని చెప్పిన అతను, ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. "గతంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాతో సహా నా భార్యను కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళతానని చెప్పాను. ఇద్దరినీ రమ్మని పిలిస్తే ఇద్దరం వెళ్దాం. లేదంటే నన్ను ఒక్కడినే రమ్మన్నా వెళతాను. నా భార్యను తీసుకువెళ్లే అవకాశం లేకపోయినా పర్వాలేదు" అని దుర్గారావు చెప్పాడు. 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లే కంటెస్టెంట్ మల తుది జాబితాలో అతనికి చోటు దక్కుతుందో? లేదో? చూడాలి మరి.
Also Read