జానకి చదువు ఆగదు.. అమరదీప్ కి శోభనం జరగదు!
on Jun 29, 2022
'మొగుడ్స్ పెళ్లామ్స్' షో ఎవ్రీ వీక్ నవ్వులతో సాగిపోతోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా అంతే జోష్ ని అందించింది. ఫైనల్గా ఈ షోలో పెర్ఫార్మ్ చేసిన కపుల్స్ అందరికీ డిఫరెంట్ నేమ్స్ తో అవార్డ్స్ కూడా అందించారు స్టమక్ స్టార్ ముక్కు అవినాష్. ముందుగా "బయట మ్యూజిక్ ఇంట్లో మ్యాజిక్" అవార్డును సాకేత్ కొమాండూరి, పూజిత కపుల్ కి అందించారు. "స్టమక్ స్టార్ అని నాకు అవార్డు ఇచ్చారు కానీ సాకేత్ కి ఇవ్వాలి" అన్నాడు అవినాష్.
తర్వాత సాకేత్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. "నాకు తెలిసి ఫస్ట్ టైం అవార్డు ఫంక్షన్ లో యాంకర్స్ దిక్కులేకుండా పక్కన నిలబడి అనౌన్స్ చేస్తుంటే గెలిచిన వాళ్ళు పోడియం మీద నిలబడి మాట్లాడుతున్నారు" అన్నాడు. స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. "ఈ అవార్డుని బయట నాతో కలిసి పని చేసే కో-మ్యుజీషియన్స్ అందరికి డేడికేట్ చేస్తున్నాన"ని చెప్పాడు సాకేత్.
తర్వాత "ఆగదు.. జరగదు" అనే అవార్డుని అమరదీప్, ప్రియాంకకి ఇచ్చారు. 'జానకి కలగనలేదు' సీరియల్ లో కపుల్ గా నటిస్తున్నారు వీళ్ళు. 'జానకి చదువు ఆగదు.. అమరదీప్ కి శోభనం జరగదు' అనే కాన్సెప్ట్ లో ఈ అవార్డుని అందించారు. ఏ షో ఐనా ఇద్దరి మధ్యా రొమాన్స్ తగ్గట్లేదు అంటూ "నీ యవ్వా తగ్గేదేలే" అనే అవార్డుని కీర్తికి, మహేష్ కి ఇచ్చారు. "ఒకటా, రెండా, మూడా" అనే అవార్డుని అర్జున్ అంబటి, సుహాసినికి ప్రెజంట్ చేశారు.
"ముసలోళ్లే కానీ మహానుభావులు" అనే అవార్డుని అప్పారావు, లక్ష్మికి అందించారు. "ఊ అంటారా.. ఊఊ అంటారా" అవార్డుని నిఖిల్, కావ్యకి ఇవ్వగా క్రేజీ టైటిల్ "ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం" అవార్డుని రవికృష్ణ, నవ్యస్వామికి అందించారు. ఫైనల్ గా "నా మాటే శాసనం" పేరుతో ఉన్న అవార్డుని జ్యోతి, గంగూలీ కపుల్ కి ఇచ్చి విన్నర్స్ అందరితో విన్నింగ్ స్పీచెస్ తీసుకున్నారు. భార్యాభర్తలు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటున్నానిని చెప్తూ ఈ షోని ఎండ్ చేసింది అందాల శ్రీముఖి.
Also Read