Illu illalu pillalu: ఆ పది లక్షల మ్యాటర్ పక్కన పెట్టి శోభనం కానియ్.. శ్రీవల్లికి ప్లాన్ చెప్పిన భాగ్యం!
on Jun 11, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-181లో.. శ్రీవల్లి తల్లి భాగ్యం పడుకుంటుంది. అప్పుడే తన భర్త భాగ్యం దగ్గరికి వస్తాడు. బయట దోమలు కుడుతున్నాయి లోపలికి రావే అని తన మీద చేయి వేసి ప్రేమగా పిలుస్తాడు. కానీ భాగ్యం మాత్రం కసురుకొని తిట్టేసి పంపించేస్తుంది. కాసేపటికి భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ఏమైందే.. నిద్ర పట్టడం లేదా అని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది. నువ్వు చేసిన పనికి నిద్ర ఎక్కడ పడుతుంది.. మీ అల్లుడు వెళ్లి వాళ్ల తమ్ముళ్ల పక్కన పడుకున్నాడు. వాళ్లతో ఆ పది లక్షల మ్యాటర్ చెప్పేయబోతుంటే బ్రేక్ వేశాను కానీ.. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. చెప్పేస్తాడేమోనని భయంగా ఉందే అమ్మా.. ఇక్కడ కొంపలు అంటుకునేట్టుగా ఉన్నాయని శ్రీవల్లి అంటుంది.
ఏంటీ తమ్ముళ్ల దగ్గర పడుకుంటున్నాడా.. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా నా మొగుడు నా కొంగు పట్టుకునే తిరుగుతాడు.. మరి నీ మొగుడు బయటపడుకోవడం ఏంటే.. ఇంతకీ మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా.. రేపటి నుంచి బయటకు వెళ్లనీయకని భాగ్యం అంటుంది. ఇక నర్మద, సాగర్లు హైదరాబాద్లో ఒక్కటైన విషయాన్ని భాగ్యానికి శ్రీవల్లి చెప్పేస్తుంది. ఆ నర్మద చాలా ఫాస్ట్.. ముందు దాని కడుపున కాయ కాచిందనుకో దాని పెత్తనం ఎక్కువైపోతుంది.. మీ చెల్లి హనీమూన్ గురించి చెప్పింది కదా.. అల్లుడు గార్ని ప్లానింగ్లో పెట్టు.. ఆ పది లక్షల మ్యాటర్ తరువాత చూద్దాం.. ముందు అల్లుడుతో మ్యాటర్ చూడు అని భాగ్యం అంటుంది. సరేనని శ్రీవల్లి చెప్తుంది.
ఇక తెల్లారినా చందు ఇంట్లోకి రాకపోయేసరికి శ్రీవల్లి గదిలో వేచి చూస్తుంది. లోపలికి రానియ్ చెప్తానంటూ చందు రాగానే జ్వరం వచ్చినట్టు డ్రామా ఆడుతుంది శ్రీవల్లి. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్.. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను.. ఆ దిగులుతో ఆ బాధతో దెబ్బకి జ్వరం వచ్చేసిందంటూ పెద్దోడి భుజంపై వాలిపోయి తెగ నటించేస్తుంది. ఇక తరువాయి భాగంలో.. శ్రీవల్లి తన డ్రామాను కంటిన్యూ చేస్తుంది. మెల్లగా ముగ్గులోకి లాగి.. తమ్ముళ్లకి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
