ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi : రాజ్ మనసులో మాటని కావ్యతో చెప్తాడా.. కూతురి కోసం రంగంలోకి కనకం!

on Jun 14, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -747 లో.....పెళ్లి రాట్ కి యామిని, రాజ్ పూజ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి రాట్ విరిగిపోతుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. ఇలా జరగకూడదు. ఈ పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. అలా ఎందుకు అండి అని పంతులు గారు అంటాడు. దాంతో అపర్ణ, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు.

ఆ తర్వాత ఇలా జరుగుతుంది ఏంటని అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. నా కూతురు కి అన్యాయం జరుగుతుందని అంటుంది‌‌ ఇంతకి ఆ యామిని ఎవరు అంటూ నిలదీస్తుంది. కనకం నువ్వు ఎక్కువ మాట్లాడకు.. ఈ పెళ్లి ఎలాగైనా మనం ఆపాలని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వెళ్తుంది. ఏంటే ఇదంతా అని అడుగుతుంది. కావ్య ఎప్పటిలాగే తనకేం పట్టనట్లు ఉంటుంది.

ఆ తర్వాత కావ్యతో రాజ్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే యామిని అసలు రాజ్ కి ఛాన్స్ ఇవ్వదు. మరొకవైపు పూజకి పంతులు ఏర్పాట్లు చేస్తుంటాడు.  కనకం, ఇందిరదేవి, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటారు. మనకి ఆ పంతులు వీక్ పాయింట్ తెలిస్తే ఆటోమెటిక్ గా మనం అనుకున్నది జరుగుతుందని కనకం అంటుంది. తరువాయి భాగంలో కావ్యతో తన మనసులో మాట చెప్పాలని రాజ్ ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.