Brahmamudi : ఒక్కటైన యామిని, రుద్రాణి.. స్పృహకోల్పోయిన రాజ్!
on May 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -717 లో..... రాజ్ కి గతం గుర్తుచేసే పనిలో భాగంగా అప్పు, కళ్యాణ్ ఇద్దరు రాజ్, కావ్య వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందని తమ స్టోరీలాగా చెప్తుంటే రాజ్ ఆసక్తిగా వింటాడు. నాకు తెలిసిన స్టోరీలాగా అనిపిస్తుందని రాజ్ అనుకుంటాడు. ఎక్కడ రాజ్ కి గతం గుర్తుకి వస్తుందోనని యామిని టెన్షన్ పడుతుంది. మరొకవైపు రాజ్ కి గతం గుర్తుకి రాకూడదని రాహుల్, రుద్రాణి పవర్ కట్ చెయ్యడానికి పవర్ మెయిన్ దగ్గరికి వెళ్తారు. పవరాఫ్ చేయబోతుంటే.. అప్పుడే యామిని కూడా పవరాఫ్ చేయబోతుంది.
మీకు కావలిసిందే నాకు కావాలి రాజ్ కి గతం గుర్తు రాకూడదని రుద్రాణి, యామిని అనుకుంటారు శత్రువుకి శత్రువు మిత్రువు అని యామిని, రుద్రాణి ఒకటి అయ్యి పవరాఫ్ చేస్తారు. రాజ్ కి గతం గుర్తు రాబోతున్న టైమ్ లో పవర్ పోవడంతో అంత డిస్టబెన్స్ అవుతుంది. నేనే పవర్ ఆఫ్ చేసాను అనికావ్యకి చెప్తుంది యామిని. బావ వెళదాం పదా అని యామిని రాజ్ ని తీసుకొని వెళ్తుంటే..కళ్యాణ్ దగ్గరికి రాజ్ వెళ్లి మీ స్టోరి వినాలని ఉందని అంటాడు. అందరు మీ దగ్గర ఉన్న ఫోన్ లో టార్చు ఆన్ చెయ్యండి అని చెప్పగానే అందరు టార్చ్ ఆన్ చేస్తారు. కళ్యాణ్, అప్పు కలిసి రాజ్, కావ్య స్టోరీని కంటిన్యూ చేస్తారు.
ఆ తర్వాత రాజ్ అంత వింటునే తల పట్టుకుంటాడు. కళ్ళు తిరుగుతున్నట్లు బెహేవ్ చేస్తూ కావ్యని చూస్తూ నువ్వు అంటూ ఏదో చెప్పబోతు స్పృహకోల్పాతాడు. రాజ్ దగ్గరికి కి యామిని వస్తుంటే వద్దని కావ్య ఆపుతుంది. రాజ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. గతం గుర్తు చేసుకోవడానికి ట్రై చేశారని డాక్టర్ తో కావ్య చెప్పగానే.. అలా చెప్పగానే అలా చేస్తే తన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు బానే ఉన్నాడు ఇంకొకసారి ఆలా చెయ్యకండి అని డాక్టర్ చెప్తాడు. అప్పుడే యామిని వస్తుంది. మీరు ఎవరు రాజ్ కి గుర్తు లేదు.. నేను తన మరదలిని అని మాత్రమే గుర్తు ఉందని కావ్య వాళ్ళకి కోపం వచ్చేలా యామిని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
