
1. 'డ్రాగన్' రిలీజ్ డేట్!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్' సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027, జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా 'ఫస్ట్ గ్లింప్స్'ను విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక పవర్ఫుల్ పోస్టర్ను షేర్ చేశారు.
2. బాలయ్య సరసన చందమామ!
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న 'NBK111' ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో 'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణ, కాజల్ కలిసి నటించడం విశేషం.
3. రామ్ చరణ్ రెమ్యునరేషన్!
పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సుమారు రూ. 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఆయన కెరీర్లోనే అత్యధికం కాగా.. రెమ్యునరేషన్ పరంగా వంద కోట్ల క్లబ్ హీరోల జాబితాలో చరణ్ చేరారు.
4. చిరు-బాబీ మూవీకి ‘కాకాజీ’ టైటిల్?
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘Mega158’ సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ‘కాకాజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇదే టైటిల్పై వార్తలు వచ్చినప్పటికీ మూవీ టీమ్ స్పందించలేదు. భారీ యాక్షన్ ఎంటర్టైన్ర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.
5. సిద్ధూ-మీనాక్షి జంటగా వెబ్ సిరీస్
సిద్ధూ జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి జంటగా నెట్ఫ్లిక్స్లో ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ రాబోతోంది. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సిరీస్ను తెరకెక్కిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సిద్ధూ, మీనాక్షి, వెంకీ అట్లూరి ముగ్గురికీ ఇది తొలి డిజిటల్ అరంగేట్రం కావడం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
6. ప్రకాష్ రాజ్ పై నాగ మహేష్ ఫైర్!
శ్రీరాముడు, సనాతన ధర్మంపై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ను.. నటుడు నాగ మహేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లను, రామాయణాన్ని అవహేళన చేయడం ప్రకాష్ రాజ్ సంకుచిత స్వభావానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాజకీయ విభేదాలను మతంతో ముడిపెడుతూ సమాజంలో ప్రాంతీయ చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు.
7. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. మాస్ ట్రీట్ రెడీ!
‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాట షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ప్రారంభం కానుంది. రామ్ చరణ్ మాస్ డ్యాన్స్కు సంయుక్త గ్లామర్ తోడవ్వడంతో.. ఇది సినిమాకు హైలైట్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
8. తండ్రిగా ప్రమోషన్ పొందిన తిరువీర్
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తన రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక తీపి కబురు అందించారు. తనకు కుమారుడు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, తన బాబుకు 'అథర్వ్ రెడ్డి' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ, తమ జీవితంలోకి కొత్త అతిథి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
9. ఏడో తరగతి ఎగ్జామ్స్ రాసిన నేషనల్ అవార్డు విన్నర్!
ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రాన్స్ 68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారు. చిన్నతనంలో పేదరికం కారణంగా నాలుగో తరగతితోనే ఆగిపోయిన తన చదువుని.. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ద్వారా మళ్లీ ప్రారంభించారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు రాయడానికి కూడా సిద్ధమవుతున్నారు.
10. 'జైలర్ 2' షూటింగ్ పూర్తీ
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న 'జైలర్ 2' షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. సుమారు 13 నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ, నేడు అధికారికంగా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సెట్స్లో చిత్రబృందం భారీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను 2026 సెకండాఫ్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.





