ఐసీయూలో బెడ్ దొరకక.. టాలీవుడ్ డైరెక్టర్ తల్లి మృతి
on May 17, 2021
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు ఇంట విషాదం నెలకొంది. ఆదివారం(మే 16) ఆయన తల్లి కరోనాతో కన్నుమూశారు. సుబ్బు తల్లి మంగమ్మ కరోనా బారిన పడి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. అయితే ఐసీయూలో బెడ్ దొరకకపోవడంతో సమయానికి ఆక్సిజన్ అందక ఆరోగ్యం విషమించి ఆమె తుది శ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారిన పడిన కమెడియన్ గౌతమ్ రాజు తమ్ముడు సిద్ధార్థ కూడా ఆక్సిజన్ కొరతతో మరణించిన సంగతి తెలిసిందే.
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుబ్బు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుబ్బు తల్లి మృతిపై హీరో సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సారీ రా సుబ్బు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Also Read