తుఫాను దెబ్బకు నా కిటికీలు ఎగిరిపోతాయని ఎంత భయమేసిందో!
on May 18, 2021
టౌటే తుఫాను ముంబై నగరాన్ని అతలాకుతలం చేసింది. సోమవారం భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు ఎలా బీభత్సాన్ని సృష్టించాయో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేసింది 'క్రాక్' హీరోయిన్ శ్రుతి హాసన్. ఇలాంటి అనుభవాన్ని తాను ఒంటరిగా ఉన్నప్పుడు చవిచూడనందుకు దేవునికి ఆమె థాంక్స్ చెప్పింది.
"ఈ తుఫాను ఎప్పటికీ అంతంకాదు. దాని దెబ్బకు నా కిటికీలు ఎగిరిపోతాయేమోనని చాలా భయం వేసింది. థాంక్ గాడ్. నేను ఒంటరిగా ఉన్న మునుపటి లాక్డౌన్ సమయంలో ఇలాంటిది జరగలేదు." అని ఆమె రాసుకొచ్చింది. ఆమె షేర్ చేసిన ఇతర వీడియోలలో ఈదురు గాలులకు, భారీ వర్షాలకు కిటికీలు దడదడ కొట్టుకుంటూ కొట్టుకుపోతాయేమో అన్నట్లు కనిపించింది.
టౌటే తుఫాను గంటకు 114 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులతో ముంబైని దారుణంగా దెబ్బతీసింది. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి, నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
శ్రుతి ప్రస్తుతం తన బాయ్ఫ్రెండ్ శంతను హజారికాతో కలిసి ముంబైలో సహజీవనం చేస్తోంది. గతవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో సముదయాన్ని షేర్ చేసి, దానికి “Locked down with my bestie @santanu_hazarika_art #thankful #twopaithyams #yumyumfood #creativity #art #talk #happyvibes.” అనే క్యాప్షన్ జోడించింది 'శ్రీమంతుడు' తార.
Also Read