`క్రాక్` మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
on May 17, 2021
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది `క్రాక్` చిత్రం. అలాంటి `క్రాక్` విజయంలో జీకే విష్ణు ఛాయాగ్రహణం కూడా ఓ ముఖ్య భూమిక పోషించింది. మరీముఖ్యంగా.. నైట్ ఎఫెక్ట్ లో తీసిన పలు సన్నివేశాలు విష్ణు ప్రతిభని ప్రతిబింబించాయి. కట్ చేస్తే.. మరోసారి రవితేజ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు విష్ణు. ఆ చిత్రమే.. `ఖిలాడి`. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `రాక్షసుడు` ఫేమ్ రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. `ఖిలాడి`కి విష్ణుతో పాటు సుజీత్ వాసుదేవ్ కూడా కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ లో సినిమాటోగ్రఫీ ఓ హైలైట్ గా నిలిచిన నేపథ్యంలో.. `ఖిలాడి`కి విష్ణు కెమెరావర్క్ ప్లస్ అయి.. `క్రాక్` మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.
కాగా, మే 28న విడుదల కావాల్సిన `ఖిలాడి` కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక.. థియేటర్స్ లోనే సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న `ఖిలాడి`కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
Also Read