పండగ చేస్కో అంటున్న రామ్ గోపి...!
on Feb 18, 2014
రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. "మసాలా" వంటి ఫ్లాప్ తర్వాత, "బలుపు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి "పండగ చేస్కో" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. యునైటెడ్ మూవీస్ బ్యానర్లో పరుచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.