గతించిన కాలం, గడిచిపోయిన రూమర్స్ వెతుక్కుంటూ రావడం సోషల్ మీడియాకు అలవాటు. ఒకప్పుడు స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో సినీ తార రాయ్ లక్ష్మీ రిలేషన్షిప్లో ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు వచ్చి ఏళ్ళవుతున్నా, ఇప్పటికీ నెట్టింట ఏదో ఒక సందర్భంలో అవి చర్చకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ అంశంపై రాయ్ లక్ష్మీ మరోసారి స్పందించి తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఆ రూమర్స్ నుండి బయటపడిన ఈ హాట్ బ్యూటీ, పదే పదే పాత విషయాలను తవ్వి తీయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన కెరీర్ మొదట్లో ధోనీతో ఉన్న క్లోజ్ నెస్ గురించి వచ్చిన వార్తలను "ఒక మచ్చ" (scar) గా ఆమె అభివర్ణించింది. అప్పట్లో జరిగిన దాన్ని, ఇప్పుడున్న తన జీవితానికి ముడిపెట్టడం ఏంటని ఆమె ప్రశ్నిస్తోంది.
ఈ రూమర్స్ వల్ల తన పర్సనల్ లైఫ్కు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. ఒకవేళ భవిష్యత్తులో తన పిల్లలు ఈ వార్తల గురించి అడిగితే తను ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని రాయ్ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. పాత విషయాలను వదిలేసి, తన ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వాలని కోరింది.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మీ. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాల్లో ఆమె స్టెప్పులకు మంచి ఆదరణ లభించింది.
ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం కోసం కష్టపడుతున్న సమయంలో, ఇలాంటి పాత రూమర్స్ తన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయని ఆమె భావిస్తోంది. నిజానికి సెలబ్రిటీల జీవితాల్లో కొన్ని సంఘటనలు అలానే ఉండిపోతాయి, కానీ వాటినే పట్టుకుని వేలాడటం సరికాదని నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుల మీద పూర్తి దృష్టి సారించిన రాయ్ లక్ష్మీ, తన పనితీరుతో కొత్త ఇమేజ్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. రూమర్స్ను పక్కనపెట్టి ఆమె నటించే పాత్రల కోసం ఎదురుచూడడమే అభిమానుల ముందున్న మార్గం.




