యాంకర్ ప్రదీప్ తండ్రి కొవిడ్తో మృతి
on May 2, 2021
పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ మాచిరాజు కొవిడ్-19తో పోరాడుతూ శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. 35 సంవత్సరాల ప్రదీప్ సైతం కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యి ఐసోలేషన్లో ఉన్నారు. దాంతో ఆయన ప్లేస్లో యాంకర్ రవి షోస్లో పాల్గొంటున్నాడు. ప్రదీప్ తమ ఇంట్లోనే క్వారంటైన్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రదీప్ తండ్రి కన్నుమూశారనే వార్త తెలియడంతో పలువురు శ్రేయోభిలాషులు, సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. తీర్చలేని లోటు నుంచి ప్రదీప్, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్కు తండ్రి మూలస్తంభంలా నిలిచారని ప్రదీప్ చెప్పారు. "నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి లాక్డౌన్ తోడ్పడింది. ఇంటిని నడపడం ఎంత క్లిష్టమైన వ్యవహారమో నాకు తెలిసి వచ్చింది. మా నాన్న చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. నన్నూ, నా ఎదుగుదలను చూసి ఆయన నిజంగా గర్వపడుతుంటారు." అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రదీప్.
ఇటీవలే ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. 2021 జనవరిలో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.