అప్పుడు `బాహుబలి` సిరీస్.. ఇప్పుడు `ప్రాజెక్ట్ కే`..!
on Jul 29, 2021
`బాహుబలి` సిరీస్ కి ముందు, తరువాత అన్నట్లుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ని విభజించవచ్చు. ఇండియన్ బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ తో పాన్ - ఇండియా స్టార్ గా అవతరించారు ప్రభాస్. `సాహో`, `రాధే శ్యామ్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కే`, `సలార్`.. ఇలా ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమా కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గానే రూపొందుతోంది. అన్నీ కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి.
ఇదిలా ఉంటే.. `బాహుబలి` సిరీస్ బాటలోనే ప్రభాస్ తాజా చిత్రం `ప్రాజెక్ట్ కే` కూడా వెళ్ళనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `బాహుబలి` సిరీస్ కి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. కట్ చేస్తే.. ఇప్పుడా సినిమా బాటలోనే `ప్రాజెక్ట్ కే` కూడా వెళ్ళనుందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దాదాపు 95 శాతం షూటింగ్ ఆర్.ఎఫ్.సిలోనే ప్లాన్ చేశారట మేకర్స్. మరి.. `బాహుబలి` సిరీస్ లాగే `ప్రాజెక్ట్ కే` కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న `ప్రాజెక్ట్ కే`ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి బాణీలు అందిస్తున్నాడు.
Also Read