ముందు ఆ అమ్మాయికి న్యాయం చేయండి.. పవన్ పై పోసాని షాకింగ్ కామెంట్స్!
on Sep 28, 2021
'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో వైసీపీ నేతలు, మద్దతుదారులు పవన్ పై మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలో రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ పై విరుచుకుపడ్డారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని.. పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాయిధరమ్ తేజ్ తన రెక్కల కష్టంతో పైకి వచ్చాడని.. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే 'రిపబ్లిక్' మూవీ ఫంక్షన్ కి వచ్చిన పవన్.. జగన్ ని, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. దిల్ రాజు రెడ్డి.. మీరు రెడ్డి ఆయన రెడ్డి.. మీరు మీరు మాట్లాడుకోండి అని అంటారా?.. జగన్ కి కుల పిచ్చి, మత పిచ్చి వుందని నిరూపించగలరా అని ఫైర్ అయ్యారు. జగన్ తో ఎప్పటికీ పోల్చుకోకు. ఆయన తన నియోజకవర్గం పులివెందులకు వెళ్ళకపోయినా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అలా ఏదైనా నియోజకవర్గానికి వెళ్లకుండా నువ్వు గెలుస్తావా?.. గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావ్ అంటూ పోసాని ఎద్దేవా చేశారు.
పంజాబ్ కు చెందిన ఓ యువతి తెలుగు సినిమాలలో అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖుడు అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని పోసాని తెలిపారు. ఆ ప్రముఖ వ్యక్తి ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించి.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించి రూ.5 కోట్లు ఇచ్చారట అని చెప్పారుచెప్పుకొచ్చారు. ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన ఆ అమ్మాయి పేరు పవన్ కి చెవిలో చెబుతానన్నారు. ఆ అమ్మాయి పేరు మీడియాకు చెప్పి, ఆ ప్రముఖ వ్యక్తిపై పోరాటం చేసి ఆమెకు న్యాయం చేస్తే పవన్ కు గుడి కడతానని.. ఆ పిల్ల జీవితాన్ని బాగుచేస్తే పవన్ ముందు జగన్ కుడా పనికిరారని అన్నారు. ఆ అమ్మాయికి అండదండలు అందించకపోతే పవన్ కు ఎవరినీ ప్రశ్నించే అర్హతలేదని పేర్కొన్నారు. పవన్ అంటే ప్రపంచానికి తెలుసు.. ఇండస్ట్రీకి తెలుసు. పవన్.. మీరు జగన్ తో పోల్చకోవద్దు అంటూ పోసాని విరుచుకుపడ్డారు. పోసాని వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
Also Read