కరోనా బారిన పడిన పోసాని.. తనను మన్నించాలని విజ్ఞప్తి
on Jul 30, 2021
ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించారు.
గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పోసాని.. ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకి కరోనా పరీక్షలు చేయగా.. వారికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వారంతా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరడంతో తాను నటిస్తున్న కొన్ని సినిమాల షూటింగులు వాయిదా పడినట్టు పోసాని తెలిపారు.
తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని.. అందుకు తనను మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో దేవుడి దయవల్ల త్వరలోనే కరోనా నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని తెలిపారు.
Also Read