Home

»

Latest News

ఇక‌ అయిపోయింది అనుకున్నారు. కానీ, రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో షాక్ ఇచ్చిన నివేదా!

Jun 17, 2026 5:59PM

టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఒకటి రెండు పరాజయాలు ఎదురైనా, కాస్త గ్యాప్ వచ్చినా సదరు ముద్దుగుమ్మ కెరీర్ ముగిసిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలైపోతాయి. సరిగ్గా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్న టాలెంటెడ్ బ్యూటీ నివేదా పేతురాజ్.. ఇప్పుడు టాలీవుడ్‌కు ఊహించని షాక్ ఇస్తూ వరుసగా రెండు బడా ప్రాజెక్టులతో సెన్సేషనల్ కంబ్యాక్ కు రెడీ అయింది.

గతంలో 'మెంటల్ మదిలో', 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అల వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఈ చెన్నై సొగసరి. అయితే ఆ తర్వాత ఈమెకు సరైన విజయాలు అందకపోవడంతో కెరీర్ కాస్త స్లో అయింది. ఇటీవలే విడుదలైన 'సింగ్ గీతం' చిత్రంలో కూడా ఆమె కేవలం చిన్న క్యామియో పాత్రకే పరిమితం కావడంతో, నివేదా టాలీవుడ్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని కొందరు అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె సైలెంట్ గా క్రేజీ లైనప్ సెట్ చేసుకుంది.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాలో నివేదా ఒక కీలక పాత్రకు ఎంపికైంది. త్రివిక్రమ్ సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్‌కి ఉండే వెయిటేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ ద్వితీయార్థంలో కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో నివేదా మెరవబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ భారీ ఆఫర్ తో ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన నివేదా.. ఇప్పుడు ఏకంగా మరో మెగా ఛాన్స్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ 'మెగా 158'లో కూడా ఆమె ఒక ముఖ్యమైన పాత్రకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి, యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నివేదా క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉండబోతోందట.

వరుసగా అవకాశాలు తగ్గిన సమయంలో కంగారుపడి కమర్షియల్ గా వెనుకబడిన ప్రాజెక్టులు చేయకుండా, ఓపికగా మంచి స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేయడం నివేదాకు ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. తన నటనను, టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుని సైలెంట్‌గా పావులు కదిపిన ఈ భామ లైనప్ చూసి ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

ఫిలిం నగర్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ ఇప్పుడు నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్ పై గట్టి చర్చ నడుస్తోంది. ఒకవైపు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మరోవైపు మెగాస్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ రెండు సినిమాలు గనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే టాలీవుడ్ లో నివేదా రేంజ్, మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాల అఫీషియల్ అప్ డేట్స్ మరియు విడుదల తేదీల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com