ఒక్క ట్వీట్ తో యువకుడికి ఉద్యోగం.. జాతిరత్నం అనిపించుకున్నాడు
on Aug 3, 2021
కరోనా కాలంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. అలాంటి వారికి అండగా నిలుస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నారు కొందరు. వారిలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఒకరు. తాజాగా ఆయన చొరవతో ఓ యువకుడు ఉద్యోగం పొందాడు. దీంతో ఈ యంగ్ హీరోపై ప్రసంశల వర్షం కురుస్తోంది.
పాండమిక్ టైమ్ లో తనకు వీలైనంత హెల్ప్ చేస్తున్నారు నవీన్. లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన 'ఈ వోక్ వేగాన్ స్టోర్ అండ్ కేఫ్' సమీర్ కు 'స్టోర్ కం కేఫ్ మేనేజర్' గా ఉద్యోగాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు నవీన్. సమీర్ కు 'ఈ వోక్ వేగాన్ స్టోర్ అండ్ కేఫ్' పంపిన ఆఫర్ లెటర్ ను పోస్ట్ చేసిన నవీన్.. త్వరలో ఈ స్టోర్ కు తాను వెళ్తానని ట్వీట్ చేశారు. అలాగే సమీర్ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్య లకు థాంక్స్ చెప్పిన ఆయన.. పాండమిక్ టైమ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ పిలుపునిచ్చారు.
ఈ ఏడాది 'జాతి రత్నాలు' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు నవీన్. వరుస మూవీ ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్న నవీన్ పాండమిక్ టైమ్ లో హెల్ప్ చేస్తూ అసలుసిసలు జాతిరత్నంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
Also Read