
పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతు తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ దొర ఎప్పడు వస్తారు, ఎలా వస్తారు అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ పై నాగబాబు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మాటే శాసనం. ఏది మంచో ఏది చెడో ఆయనకు బాగా తెలుసు. నాయకుడు నడిచే దారిలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, ప్రశ్నలు అడగకుండా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ వెనకాల నడవాలని సూచించారు.
సదరు మాటలపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తు. "shut your doubts, silence your tongue, and follow the leader without questions" .మీ అనుమానాలు ఆపండి, మీ నోరు మూయండి, ప్రశ్నలు లేకుండా నాయకుడిని అనుసరించండి అంటే అర్థం ఏంటి. "మేమేమీ గొర్రెలు కాదు.. బానిస బ్రతుకులు బ్రతకడానికి సిద్ధంగా లేము. ప్రజాస్వామ్యంలో నాయకుడిని ప్రశ్నించడం తమ హక్కు. ఈ విధమైన బెదిరింపులు వద్దంటూ #JustAsking ట్యాగ్తో పోస్ట్ చేశారు.
Also read: Rashmika Mandanna: ఆ మూవీలో నటించడానికే బయపడింది వాస్తవం..రష్మిక కీలక వ్యాఖ్యలు






