నాగచైతన్య వర్సెస్ చందు మొండేటి!
on Jun 25, 2022
యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో సక్సెస్ అందుకున్న దర్శకుల్లో చందు మొండేటి ఒకరు. 2016లో విడుదలైన `ప్రేమమ్`తో ఈ ఇద్దరు మంచి విజయం అందుకున్నారు. అయితే, 2018లో వచ్చిన వీరి సెకండ్ జాయింట్ వెంచర్ `సవ్యసాచి` డిజప్పాయింట్ చేసింది.
ఇదిలా ఉంటే, నాలుగేళ్ళ తరువాత ఈ ఇద్దరు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన చిత్రం `థాంక్ యూ`. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 22న విడుదలకు సిద్ధమైంది. ఇక అదే రోజు చందు మొండేటి దర్శకత్వం వహించిన `కార్తికేయ 2` విడుదల కానుంది. నిఖిల్ కథానాయకుడిగా నటించిన ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ 2014 నాటి `కార్తికేయ`కి సీక్వెల్ గా తెరకెక్కింది. మరి.. నాగచైతన్య వర్సెస్ చందు మొండేటి అన్నట్లుగా ఉన్న జూలై 22 బాక్సాఫీస్ వార్ లో ఎవరు హిట్ కొడతారో చూడాలి.
కాగా, `థాంక్ యూ`లో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించగా.. `కార్తికేయ 2`లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక.
Also Read