`ఆర్ ఆర్ ఆర్` మిస్.. మరో రెండు చిత్రాలు ఎస్..!
on Sep 27, 2021
స్వరవాణి కీరవాణి తన బాణీలతో తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో 2019లో విడుదలైన `యన్టీఆర్` బయోపిక్ రెండు భాగాల కోసం తన స్వరాలతో చివరి సారిగా సందడి చేశారు కీరవాణి. ఆపై తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రమైన `ఆర్ ఆర్ ఆర్` కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్న కీరవాణి.. పరిమిత సంఖ్యలోనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 2021 విజయదశమి కానుకగా అక్టోబర్ 13న విడుదల కావాల్సిన `ఆర్ ఆర్ ఆర్`తో కీరవాణి మళ్ళీ పలకరిస్తారనుకున్న ఆయన అభిమానులకు.. ఆ చిత్రం వాయిదా పడడం నిరాశను కలిగించింది. అయితే, ఇప్పుడదే సీజన్ లో రెండు ఆసక్తికరమైన సినిమాలతో ఎంటర్టైన్ చేయనున్నారు స్వరవాణి. ఆ చిత్రాలే.. `కొండ పొలం`, `పెళ్ళి సందD`. అక్టోబర్ 8న అడ్వెంచరస్ డ్రామా `కొండ పొలం` రిలీజ్ కానుండగా.. ఆ సినిమా రిలీజైన వారం లోపే రొమాంటిక్ డ్రామా `పెళ్ళి సందD` కూడా విడుదల కానుంది.
మరి.. గడిచిన ఒకటిన్నర దశాబ్ద కాలంలో రాజమౌళి చిత్రాలు మినహాయిస్తే.. మరే దర్శకులతోనూ పెద్దగా విజయాలు లేని కీరవాణికి ఈ రెండు చిత్రాలతోనైనా ఆ లోటు తీరుతుందేమో చూడాలి.
Also Read