Home

»

Latest News

Lenin: సరికొత్త చర్చకి దారి తీస్తున్న క్లైమాక్స్ డైలాగ్.. ధర్మరాజు, కుక్క మాత్రమే మిగిలారా! 

Jul 13, 2026 4:28PM

 


భవిష్యత్తులో సృష్టించబోయే  విజయపరంపరకి శంఖారావం పూరించినట్టుగా లెనిన్ తో అఖిల్ భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో రికార్డు కలెక్షన్స్  లెనిన్ వశం అవుతున్నాయి. భారతీయుల మనోఫలకంలో నిత్యం  మెదులుతూ ఉండే  మహాభారతం స్ఫూర్తితోనే లెనిన్ కథనం ఉంటుంది. మహాభారతంలో కావాల్సిన వాళ్లే, మనం ప్రేమించే వాళ్లే, మన కలల్ని, జీవితాన్ని నాశనం చేసిస్తే  పగ తీర్చుకోవడం తప్పదనే పాయింట్  ఆధారంగా లెనిన్ తెరకెక్కడం ప్రతి ఒక్కరికి లెనిన్ మరింతగా దగ్గరవవుతున్నాడు.  

క్లైమాక్స్ సీన్‌లో లెనిన్ ని ఉద్దేశించి పోలీస్ ఆఫీసర్ (సునీల్) మాట్లాడుతు  మహాభారతంలోని  కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు, ఒక కుక్క మాత్రమే మిగిలాయి" అనే డైలాగ్ చెప్పాడు.  ఆ సంభాషణ కేవలం ఒక సినిమా డైలాగ్ మాత్రమే కాదు, మానవ జీవిత సత్యాన్ని, నైతిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప సందేశం. ఈ డైలాగ్ యొక్క సుదీర్ఘ వివరణను, దాని వెనుక ఉన్న పురాణ నేపథ్యాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.చెప్పిన ఒక డైలాగ్ ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది.

మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు 36 సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పరిపాలించారు. ఆ తర్వాత జీవితంపై వైరాగ్యంతో మహాప్రస్థానాన్ని ప్రారంబిస్తు ద్రౌపదితో సహా ఐదుగురు పాండవులు హిమాలయాల గుండా స్వర్గానికి ప్రయాణమయ్యారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారిని ఒక సాధారణ కుక్క మొదటి నుండి అనుసరిస్తూనే ఉంది. ప్రయాణం సాగుతుండగా, ఒక్కొక్కరుగా తమ పాపాల కారణంగా కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మొదట ద్రౌపది, ఆ తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరగా భీముడు కూడా కిందపడిపోయారు. కానీ ఆఖరి వరకు ధర్మరాజు ఏమాత్రం చలించకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయనతో పాటు ఆ నల్లని కుక్క మాత్రమే చివరి వరకు నడుస్తూ వచ్చింది.

చివరకు స్వర్గలోక అధిపతి అయిన ఇంద్రుడు తన రథంతో ధర్మరాజును స్వర్గానికి తీసుకెళ్లడానికి స్వయంగా వచ్చాడు. అయితే, తనతో పాటు వచ్చిన ఆ కుక్కను కూడా రథం ఎక్కించుకోవాలని ధర్మరాజు కోరాడు. దానికి ఇంద్రుడు నిరాకరిస్తూ, "కుక్కలకు స్వర్గంలో ప్రవేశం లేదు, దాన్ని అక్కడే వదిలేసి రా" అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో నిక్కచ్చిగా సమాధానమిచ్చాడు. "నన్ను నమ్మి, నా నీడలా నా వెంటే వచ్చిన ఈ ప్రాణాన్ని నేను అర్ధాంతరంగా వదిలిపెట్టలేను. ఒకవేళ దీనికి స్వర్గ ప్రవేశం లేకపోతే, నాకు కూడా ఆ స్వర్గం వద్దు" అని ఖచ్చితంగా చెప్పేశాడు. ధర్మరాజు యొక్క ఈ అచంచలమైన ధర్మనిష్ఠని  చూసి ఆ కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు (ధర్మదేవత) తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజును పరీక్షించడానికే తాను కుక్క రూపంలో వచ్చానని చెప్పి, అతని నీతిని మెచ్చుకున్నాడు.


also read: Ntr: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అధికారకంగా లేఖ రిలీజ్ 

ఆ డైలాగ్ ని క్లైమాక్స్‌లో సునీల్ క్యారక్టర్  ద్వారా ఎందుకు చెప్పించారంటే, సదరు డైలాగ్ లెనిన్ క్యారెక్టరైజేషన్‌కి  పూర్తి అద్దం పడుతుంది.  యుద్ధ రంగంలో లేదా జీవిత పోరాటంలో ఎంతమంది ఉన్నా, చివరికి మిగిలేది కేవలం ధర్మం మరియు ఆ ధర్మాన్ని నమ్మినవాడు మాత్రమే. ఇక్కడ కుక్క అనేది విశ్వాసానికి, నిస్వార్థ భక్తికి మరియు ధర్మానికి ప్రతీక. ప్రపంచమంతా నిన్ను వదిలేసినా, నువ్వు నమ్మిన ధర్మం మరియు నీకున్న విశ్వాసం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు. క్లైమాక్స్ లో హీరో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు, అతని వెనుక ఉన్న లాయల్టీని, అతను ఎంచుకున్న ధర్మ మార్గాన్ని ఎలివేట్ చేయడానికి ఈ పురాణ గాథను దర్శకుడు అద్భుతంగా వాడుకున్నాడు . అందుకే ఈ డైలాగ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచడమే కాకుండా, జీవితంలో విశ్వాసానికి ఉన్న విలువని గుర్తు చేస్తుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com