రామ్చరణ్కు విలన్ సుదీప్?
on May 5, 2021
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ను నిర్మించనున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించారు దిల్ రాజు. లేటెస్ట్ అప్డేడ్ ప్రకారం ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ యాక్టర్ సుదీప్ను సంప్రదించారు. సుదీప్కు డైరెక్టర్ శంకర్ కథ వినిపించారనీ, అయితే ఆయన ఇంకా తన డెసిషన్ చెప్పలేదనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రామ్గోపాల్ వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచమైన సుదీప్, ఆ తర్వాత రాజమౌళి సినిమా 'ఈగ'లో విలన్గా నటించడం ద్వారా పాపులర్ అయ్యాడు.
ఆ సినిమా తమిళంలో 'నాన్ ఈ'గా రిలీజవగా, హిందీలో 'మఖ్ఖి'గా అనువాదమైంది. ప్రభాస్ సినిమా 'బాహుబలి'లో ఓ స్పెషల్ రోల్ చేసిన సుదీప్, రెండేళ్ల క్రితం చిరంజీవితో 'సైరా.. నరసింహారెడ్డి' మూవీలో కనిపించాడు. సందర్భవశాత్తూ ఆ సినిమాని నిర్మించింది రామ్చరణ్. చివరిసారిగా సల్మాన్ ఖాన్ సినిమా 'దబాంగ్ 3'లో కనిపించిన సుదీప్ లేటెస్ట్ కన్నడ ఫిల్మ్ 'కోటిగొబ్బ 3' రిలీజ్ కోసం వెయిటింగ్లో ఉంది.
రామ్చరణ్-శంకర్ కాంబినేషన్లో సుదీప్కు ఆఫర్ చేసింది మెయిన్ విలన్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విలన్ రోల్లో తానెలా చెలరేగిపోతాడో 'ఈగ' మూవీ ద్వారా సుదీప్ మనకు చూపించాడు. శంకర్ సినిమాల్లో విలన్ రోల్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి, రామ్చరణ్కు సరైన విలన్గా అతను బాగా నప్పుతాడని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. మరి.. రామ్చరణ్కు సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో, లేదో చూడాలి.