'కాలా', 'అసురన్' ఫేమ్ నితీశ్ వీరా కొవిడ్తో మృతి
on May 17, 2021
తెల్లారి లేవగానే ఏ వైపు నుంచి ఎవరి చావు వినాల్సి వస్తుందోననే దురవస్థలోకి వచ్చాం. మహమ్మారి సెకండ్ వేవ్ జన జీవితాల్ని అతలాకుతలం చేయడమే కాకుండా, ఎందరో ఊపిరిని కూడా తీసేసుకుంటూ పోతోంది. దేశంలోని సినీసీమకు చెందిన పలువురు మహమ్మారితో పోరాటం చేస్తూ కన్నుమూస్తున్నారు. ఈరోజు కూడా అందుకు మినహాయింపు కాదు. కోలీవుడ్ నటుడు నితీశ్ వీరా కొవిడ్తో పోరాడి, అలసిపోయి తుదిశ్వాస విడిచాడు. ఆయన వయసు కేవలం 45 సంవత్సరాలు.
కెరీర్ మొదట్లో 'పుదుపెట్టై', 'పేరరసు', 'వెన్నిల కబడి కుళు' లాంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన నితీశ్ వీరా కెరీర్ పా. రంజిత్ డైరెక్ట్ చేసిన 'కాలా' మూవీతో టర్న్ తీసుకుంది. ఆ సినిమాలో అతను రజనీకాంత్, ఈశ్వరీరావుల కుమారుడిగా నటించి ఆకట్టుకున్నాడు.
ఇటీవల ధనుష్ సూపర్ హిట్ సినిమా, అతడిని బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డ్ తీసుకొచ్చిన 'అసురన్'లో వీరా ఓ కీలక పాత్ర పోషించాడు. ధనుష్ ఫ్లాష్బ్యాక్ స్టోరీలో వీరా ఓ నెగటివ్ క్యారెక్టర్లో కనిపించాడు. ఆ పాత్రలో అతను ఒదిగిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'లాబమ్'లోనూ అతను ఓ కీలక పాత్ర చేసినట్లు సమాచారం. వీర ఆకస్మిక మృతి అతని సన్నిహితులతో పాటు కోలీవుడ్నూ షాక్కు గురిచేసింది. పలువురు సెలబ్రిటీలు అతని మృతికి సంతాపం తెలిపారు.