
ఈ రోజు లెజండ్రీ నటుడు, అభిమానులు టైగర్ గా పిలుచుకునే నందమూరి హరికృష్ణ గారు పరమపదించిన రోజు. తెలుగు సినీ ప్రపంచంలో, రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన హరికృష్ణ జ్ఞాపకాలు నందమూరి అభిమానుల గుండెల్లో ఎప్పటికీ పదిలమే
ఈ రోజు ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ తండ్రిని గుర్తుచేసుకుంటు షేర్ చేసిన భావోద్వేగ సందేశం అభిమానుల హృదయాలని హత్తుకుంటుంది. "మీరు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. మా ఉనికికి, మా గుర్తింపునకు మీరే మూలం. మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాకు మార్గదర్శకంగా నిలుస్తాయి" అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మాటలు నందమూరి వంశం పట్ల వారికున్న గౌరవాన్ని, తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమని ప్రతిబింబిస్తోంది.
Also Read: Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ-రిలీజ్ బాక్సాఫీస్ షేక్!
2018 ఆగస్టు 29న హైదరాబాద్ నుంచి కారులో నెల్లూరులో జరిగే పెళ్ళికి వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి దగ్గరలో ఉన్న అన్నెపర్తి విలేజ్ దగ్గర కారు యాక్సిడెంట్ కి గురయ్యింది. అప్పుడు సమయం ఉదయం ఆరుగంటలు. ప్రమాద సమయంలో హరికృష్ణ గారే డ్రైవింగ్ చేస్తున్నారు.
[ Ntr, HariKrishna, Kalyanram, jayanthi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood]
.webp)





