మహేశ్ తో మరోసారి జగ్గూభాయ్?
on Aug 4, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `శ్రీమంతుడు`(2015)లో మహేశ్ కి తండ్రిగా అలరించారు సీనియర్ హీరో జగపతి బాబు. కట్ చేస్తే.. ఆరేళ్ళ తరువాత మరోమారు మహేశ్ సినిమాలో నటించబోతున్నారట ఈ వెర్సటైల్ స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా `సర్కారు వారి పాట` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం అర్జున్, అరవింద్ స్వామి వంటి సీనియర్ స్టార్స్ పేర్లు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడా వేషంలో జగ్గూభాయ్ ఫిక్సయ్యారట. త్వరలోనే `సర్కారు వారి పాట`లో జగపతి బాబు ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. `శ్రీమంతుడు` లాగే మహేశ్ బాబు, జగపతి బాబు కాంబినేషన్.. `సర్కారు వారి పాట`కి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందేమో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`లో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
Also Read