అల్లు అర్జున్తో కలిసి డాన్స్ చేయాలనుంది!
on May 2, 2021
కిల్లర్ డాన్స్ మూవ్స్తో ఆడియెన్స్ను అబ్బురపరుస్తుంటుంది బాలీవుడ్ తార దిశా పటాని. 'రాధే' మూవీకి సంబంధించి రీసెంట్గా రిలీజైన 'సీటీమార్' సాంగ్లో సల్మాన్ఖాన్తో కలిసి ఆమె చేసిన డాన్స్కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఆ సాంగ్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి డాన్స్ చేసిన 'దువ్వాడ జగన్నాథమ్' మూవీలోని బ్లాక్బస్టర్ సాంగ్ 'సీటీమార్'కు రీమేక్.
"సీటీమార్ సాంగ్కు ప్రభుదేవా సార్, జాని మాస్టర్ గైడెన్స్ కింద డాన్స్ చేయడం ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఆ సాంగ్ రిలీజ్ అవడానికి ముందు నెర్వస్గా ఫీలయ్యాను. కానీ ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూశాక నా భయాలన్నీ పక్కకుపోయాయి. వారి ఆదరణకు చాలా ఆనందంగా ఉంది." అని చెప్పింది దిశ.
ఇదివరకు 'అల.. వైకుంఠపురములో' మూవీలోని "బుట్టబొమ్మ" సాంగ్లో అల్లు అర్జున్ డాన్స్ మూవ్మెంట్స్ను దిశ తెగ మెచ్చుకుంది. 'పుష్ప' మూవీలో ఓ స్పెషల్ సాంగ్లో బన్నీతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుందని ప్రచారంలోకి వచ్చింది. ఆ విషయమే ఆమెను అడగగా, "నేను అల్లు అర్జున్కు పెద్ద ఫ్యాన్ను. ఆయన ఫాబ్యులస్ డాన్సర్. ఆయనతో స్క్రీన్ చేసుకోవడం అనేది ఓ గొప్ప అవకాశం అవుతుంది." అని చెప్పింది దిశ.
సూపర్ డాన్సర్స్ అయిన హృతిక్ రోషన్, అల్లు అర్జున్లతో కలిసి డాన్స్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపింది. "ఒక్క దోషమూ కనిపించిన హృతిక్ డాన్స్కు, అల్లు అర్జున్ టెర్రిఫిక్ మూవ్స్కు నేను ఫ్యాన్ని. స్క్రీన్పై వారితో కలిసి పర్ఫామ్ చేయడం నాకు ట్రీట్ అవుతుంది అంటోంది దిశ. సో.. బన్నీతో కలిసి ఆమె డాన్స్ చేసే రోజు త్వరలోనే వస్తుందేమో చూద్దాం.
సందర్భవశాత్తూ దిశ హీరోయిన్గా తెరంగేట్రం చేసింది టాలీవుడ్ మూవీతోటే. అది పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్'. అందులో ఆమె వరుణ్ తేజ్ జోడీగా నటించింది.