
- హన్సిక ఫ్యామిలీలో రచ్చ
- కోర్టు మెట్లెక్కిన వివాదం
- వదిన ముస్కాన్పై రూ. 2 కోట్లకు దావా
- బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఇటీవల భర్త సోహైల్తో విడాకులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ(Hansika Motwani).. ఇప్పుడు కుటుంబ వివాదాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హన్సిక.. ఇప్పుడు ఏకంగా కోర్టు మెట్లెక్కడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తన వదిన ముస్కాన్పై హన్సిక రూ. 2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ హన్సిక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
గత కొద్ది రోజులుగా హన్సిక పై, ఆమె కుటుంబంపై ముస్కాన్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని భావించిన హన్సిక.. కోర్టు మెట్లెక్కారు. తనపై చేసిన ఆరోపణలకు గానూ ముస్కాన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హన్సిక తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు ప్రాథమికంగా హన్సిక వాదనతో ఏకీభవించింది. హన్సికకు, ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ముస్కాన్ ఎటువంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని, వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వివాదంలో ప్రస్తుతానికి హన్సికకు కొంత ఊరట లభించినట్లయింది.
నిజానికి హన్సికకు ఈ మధ్య కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇటీవల తన భర్త సోహైల్ తో విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్లడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హన్సిక.. ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి.
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఇలాంటి వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ హన్సిక మాత్రం తన ఆత్మగౌరవం కోసం బహిరంగంగానే పోరాడాలని నిర్ణయించుకోవడం విశేషం. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్లతో బిజీగా ఉండే ఈ హీరోయిన్.. ఇప్పుడు ఈ చట్టపరమైన చిక్కులను ఎలా అధిగమిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం హన్సిక ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ ఫ్యామిలీ డ్రామాకు కోర్టులో ఎలాంటి ముగింపు లభిస్తుందో వేచి చూడాల్సిందే!





