మహేశ్కి జతగా దిశ?
on May 2, 2021
'అతడు' (2005), 'ఖలేజా' (2010) తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శనివారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్ లోకి రానుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారని ఇప్పటికే కథనాలు వచ్చాయి. మెయిన్ లీడ్ గా పూజా హెగ్డే.. సెకండ్ లీడ్ గా నిధి అగర్వాల్ సెలెక్ట్ అయ్యారన్నది ఆ వార్తల సారాంశం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని పేరు కూడా పరిశీలనలో ఉందట. అయితే, మెయిన్ లీడ్ కోసమా లేదా సెకండ్ లీడ్ కోసమా అన్న విషయంపై క్లారిటీ రాలేదు. త్వరలోనే '#SSMB28'లో దిశ ఎంట్రీపై స్పష్టత వస్తుంది.
కాగా, దిశ ఇప్పటికే 'లోఫర్' (మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడు) (2015) అనే తెలుగు చిత్రంలో నటించింది. ఆపై బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కి జంటగా ఆమె నటించిన 'రాధే' ఈ నెల 13న థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ ఒకే రోజున విడుదలకు సిద్ధమైంది.
Also Read