
దిల్ రాజు.. పర్సన్ తో సంబంధం లేకుండా కంటెంట్ పైనే దృష్టి పెట్టి భారీ హిట్స్ అందుకొని బడా నిర్మాత అయ్యాడు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన సినీ జర్నీ, సాధించిన విజయాలు, ప్రస్తుత జర్నీ అందరకి తెలిసినవే . కానీ తెలియాల్సిందల్లా దిల్ రాజు టైప్ లోనే 'ఎలాంటి కథ ప్రేక్షకులకు నచ్చుతుంది? ఎంత బడ్జెట్ తో సేఫ్ అవుతాము? ఏ వర్గం ఆడియెన్స్ ఏ సినిమాని గుండెల్లో పెట్టుకుంటారు? అనే విషయాలని అలోచించి విజయదుందుభి మోగించే మరో నిర్మాత ఇండస్ట్రీలో ఎందుకు రాలేదు అని. అందుకు గల కారణాల గురించి నిత్యం సినీ సర్కిల్స్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి.
ఇప్పటి సినీ పరిస్థితులని పరిశీలిస్తే, నిర్మాతలు అసలైన 'కంటెంట్'ను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కథే కథానాయకుడిగా ఉండేది. కానీ ఇప్పుడు కథ కంటే ఎక్కువగా హంగులు, ఆర్భాటాలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. నిర్మాతలు 100% దృష్టిని కథలోని భావోద్వేగాలు, స్క్రిప్ట్ బలం మీద పెట్టాల్సింది పోయి, కేవలం కాంబినేషన్లు కుదర్చడంలోనే సమయాన్ని వృథా చేస్తున్నారు. ఈ క్రమంలో అసలైన కథాబలం కొరవడి, బాక్సాఫీస్ వద్ద 70% నుండి 80% సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పటికీ, థియేటర్లలో కనీసం రెండు వారాల పాటు నిలబడలేకపోవడానికి కారణం కంటెంట్ లేకపోవడమే.
దీనికి తోడు ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో 'షో బాచ్' సంస్కృతి తీవ్రంగా పెరిగిపోయింది. నిర్మాతతో పలనా దర్శకుడి వద్ద అసిస్టెంట్ గా చేసాని అని చెప్పగానే కథని పుట్టిస్తున్నాడా! సృష్టిస్తున్నాడా అని చూడకుండా చెప్పేదే గొప్పది అనుకుంటూ వింటున్నారు. ఈ విషయంలో దర్శకుడు చెప్పేది నిజమా కాదా, ప్రస్తుతం ఎలాంటి కథలని చూస్తున్నారు. లేదా బయట ప్రేక్షకుల మెంటాలిటీ ఎలా ఉంది, ఎలాంటి కథని తెరకెక్కించాలి అని నిర్మాత జడ్జ్ చేయలేకపోతున్నాడు.అసలు కథతో, మేకింగ్తో సంబంధం లేని వ్యక్తులు, పబ్లిసిటీ స్టంట్లు చేసేవారు, సోషల్ మీడియా హంగామా చేసే కొన్ని పిఆర్ గ్రూపులు ఎక్కువైపోయాయి. వీరంతా సినిమా షూటింగ్ ప్రారంభం నుండి విడులయ్యే వరకు అనవసరమైన హడావుడి చేస్తూ లీక్లు, హైప్ క్రియేట్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతలు స్క్రిప్ట్ టేబుల్ వద్ద గంటల తరబడి కూర్చుని, 10 నుండి 15 సార్లు రీ-రైట్ చేయించి, ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవారు. కానీ నేటి తరం నిర్మాతలు షూటింగ్ స్పాట్లో కేవలం ఆర్భాటాలు, కారవాన్ల హంగామా, అనవసరపు ఖర్చులకే పరిమితమవుతున్నారు.
Also read: లక్షమంది అమ్మాయిలకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ కానుక
గత ఐదేళ్లలో తెలుగు సినీ పరిశ్రమ పరిమాణం మరియు బడ్జెట్లు 300% పైగా పెరిగాయి. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల రూ. 200 కోట్ల నుండి రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు సర్వసాధారణం అయ్యాయి. కానీ బడ్జెట్ పెరిగినంతగా కంటెంట్ క్వాలిటీ పెరగడం లేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏకంగా 30% నుండి 40% బడ్జెట్ కేవలం నిర్మాణ విలంబన, అనవసరమైన వృథా ఖర్చులకే సరిపోతోంది. దిల్ రాజు ఒక సినిమాను అనుకున్న బడ్జెట్లో, అనుకున్న సమయానికి పూర్తి చేసి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా సరైన ధరకు థియేటర్లకు చేర్చే వ్యవస్థను నిర్మించారు. కానీ నేటి నిర్మాతలు బిజినెస్ లెక్కల మీద ఉన్న శ్రద్ధ, ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడం మీద పెట్టడం లేదు. సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం కాదు, అది ఒక వ్యాపారం మరియు కళల కలయిక. దిల్ రాజు లాంటి విజనరీ నిర్మాతలు మళ్లీ రావాలంటే, నిర్మాతలు కేవలం ఫైనాన్సియర్లుగా మిగిలిపోకుండా, కథను ప్రేమించే నిజమైన క్రియేటర్లుగా మారాల్సిన అవసరం ఉంది. అసలు కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు కూడా కాంబినేషన్స్ వెంట పడుతున్నాడని ఫిలిం నగర్ లో డైలీ వినిపించే న్యూస్.
Dil Raju, Tollywood




