
దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో తన సిగ్నేచర్ ని కాపాడుకుంటూ వస్తున్న చిరంజీవి(chiranjeevi)ప్రస్తుతం తన 158 వ చిత్రాన్ని బాబీ దర్సకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య కాంబో కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది.
చిరంజీవి ఈ రోజు దియేటర్స్ లోకి విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love stroy)మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఆ ఈవెంట్ లో చిరు మాట్లాడుతు సినిమా ఘన విజయం సాధించాలని కోరుకోవడంతో పాటు నిర్మాతలైన ఎస్ కె ఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ లని అభినందించాడు. ఇక ముఖ్యంగా ఆ ఇద్దరు చిరంజీవిని పిలవడానికి కారణం తమ ప్రీవియస్ మూవీ బేబీ రిలీజ్ తర్వాత వెంటనే జరిగిన సక్సెస్ మీట్ కి చిరంజీవిని గెస్ట్ గా పిలిచారు. దీంతో బేబీ మరింతగా తన హిట్ రేంజ్ ని పెంచుకుంది. దీంతో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మరింత ఘన విజయం సాధించాలని రిలీజ్ కి ముందే పిలిచారు. ఇప్పుడు వాళ్ళ సెంటి మెంట్ ప్రకారం చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ థియేటర్స్ వద్ద జనరేట్ అవుతుంది. కొంత మంది ప్రేక్షకులైతే కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. చిరంజీవికి ఎస్ కె ఎన్, సాయి రాజేష్ డై హార్డ్ ఫ్యాన్స్ అనే విషయం తెలిసిందే.
Also read: ఈ సారి హిట్ ఖాయమా.. ఈ సినిమా ఏం చెప్పబోతోంది!
chiranjeevi, chenni love story, kiran abbavaram, sri gouri priya





