`ఆదిపురుష్`లో `బిగ్ బాస్` విన్నర్
on May 17, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ మైథలాజికల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `ఆదిపురుష్` పేరుతో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో శ్రీరామచంద్రుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. అతనికి జోడీగా సీత పాత్రలో `1 నేనొక్కడినే` ఫేమ్ కృతి సనన్ నటిస్తుండగా.. లంకేశ్ (రావణాసురుడు) భూమికలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. లక్ష్మణుడి పాత్రని సన్నీ సింగ్ ధరిస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో రావణాసురుడి తనయుడు మేఘనాథుడు పాత్రలో సిద్ధార్థ్ శుక్లా ఎంపికయ్యాడని టాక్. `బిగ్ బాస్ సీజన్ 13` (హిందీ) విన్నర్ గా వార్తల్లో నిలిచిన సిద్ధార్థ్.. `బాలిక వధు` (తెలుగులో `చిన్నారి పెళ్ళికూతురు`)తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడే. అలాగే వరుణ్ ధావన్, ఆలియా భట్ జంటగా నటించిన `హప్టీ శర్మ కీ దుల్హానియా` (2014) చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్రలో నటించాడు సిద్ధార్థ్. త్వరలోనే `ఆదిపురుష్`లో సిద్ధార్థ్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న `ఆదిపురుష్`ని `తానాజీ` ఫేమ్ ఓం రౌత్ రూపొందిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తయారవుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా, 2022 ఆగస్టు 11న `ఆదిపురుష్`ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read