'క్రాక్' తరహాలో వాస్తవ ఘటనల నేపథ్యంలో బాలయ్య-గోపీచంద్ మూవీ!
on May 16, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ చేతిలో ప్రస్తుతం 'అఖండ' చిత్రం ఉంది. మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో ఘనాపాటి అయిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. 'అఖండ'పై స్కై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అన్నీ అనుకూలిస్తే జూలై కల్లా షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందట.
ఇదిలా ఉంటే.. 'అఖండ' తరువాత 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బాలయ్య ఓ మాస్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ప్రారంభం కావాల్సిన ఈ సినిమాని.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూలై నుంచి పట్టాలెక్కించే దిశగా బాలయ్య అండ్ కో ఫిక్సయిందట. అంతేకాదు.. బాలయ్య లక్కీ సీజన్ అయిన సంక్రాంతికి ఈ సినిమా తెరపైకి రావడం ఖాయమంటున్నారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనుంది.
ఒంగోలుకు చెందిన రౌడీ షీటర్ కఠారి కృష్ణ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా 'క్రాక్'ను రూపొందించి కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన గోపీచంద్.. ఇప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని కోస్తా తీరంలో కొన్నేళ్ల క్రితం జరిగిన కొన్ని సంచలన యథార్థ ఘటనల ఆధారంగా బాలయ్య సినిమాని తీసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
Also Read