
-బాబాయ్,అబ్బాయ్ ది బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యం
-మరి ఆ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే
-ఇండియాలోనే అతిపెద్ద మల్టీస్టారర్
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
సెల్యులాయిడ్ వద్ద బాబాయ్, అబ్బాయ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna),మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కట్ ఔట్స్ కి ఉన్న హిట్ హిస్టరీని చెప్పుకోవాలంటే అలుపు రావాల్సిందే. అంతలా సుదీర్ఘ కాలం నుంచి తమ ఛరిష్మాతో బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికి అభిమానులు ఒక విన్నపం చేస్తున్నారు.మరి ఆ విన్నపం ఏంటో చూద్దాం.
బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ మాస్ సబ్జెట్. రాయలసీమ నేపధ్యం అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. దయచేసి మా కోసం ఆ ఇద్దరు మల్టి స్టారర్ చేసి మాలో ఆనందాన్ని నింపాలని సోషల్ మీడియా వేదికగా తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ కోరికని అభిమానులు ఎప్పట్నుంచో వినిపిస్తూ వస్తున్నారు. మరి ఏదో ఒక రోజు వాళ్ళ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
Also read: Peddi: పెద్ది చూస్తుంటే ఆ సినిమా గుర్తుకురాకూడదు.. మరి టీం ఏం చేసింది
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopinchand Malineni)దర్శకతంలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల శివ(kortala Siva)దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఎన్టీఆర్ ప్రెజెంట్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)దర్శకత్వంలో చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక బాబాయ్, అబ్బాయ్ కలిసి చెయ్యాలని కోరుకుందాం.






