అల్లరి అల్లరిగా అనసూయ 'క్వారంటైన్ బర్త్డే'!
on May 16, 2021
తెలుగు టీవీకి గ్లామర్ అద్దిన యాంకర్గా పేరు తెచ్చుకొని, ప్రస్తుతం టాప్ యాంకర్గా వెలిగిపోతున్న అనసూయా భరద్వాజ్ శనివారం రాత్రి తన బర్త్డేని ఫ్యామిలీతో సింపుల్గా.. బట్.. సందడిగా చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
భర్త సుశాంక్ భరద్వాజ్, కొడుకులు అయాన్ష్, శౌర్యలతో ఆమె ఎంతగా తన బర్త్డే పార్టీలో అల్లరి చేశారో ఆ పిక్చర్స్ తెలియజేస్తున్నాయి. ఆ ఫొటోలకు ఆమె "క్వారంటైన్ బర్త్డే 2021" అనే క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటోలను అనసూయ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.
తన ఫ్యామిలీ అంటే ఆమెకు ఎంత ప్రేమో ఆ పిక్చర్స్లో మనం చూడొచ్చు. అనసూయ భర్త సుశాంక్ అయితే విచిత్ర వేషధారణతో నవ్వించాడు.
ఇద్దరు కొడుకులూ టాయ్ కళ్లజోళ్లు పెట్టుకొని అమ్మకు బర్త్డే విషెస్ చెప్పి, నానా అల్లరీ చేశారు. కేవలం తన బర్త్డే పార్టీ ఫ్యామిలీకి పరిమితమైనప్పటికీ తెగ ఎంజాయ్ చేశారు అనసూయ.
మొదట న్యూస్ ప్రెజెంటర్గా టెలివిజన్లో కెరీర్ ఆరంభించిన అనసూయ.. ఆ తర్వాత షో ప్రెజెంటర్గా, యాంకర్గా మారారు. అదివరకు ఉన్న యాంకర్లకు భిన్నంగా బుల్లితెరకు తన స్టైలింగ్తో, తన లుక్స్తో గ్లామర్ తీసుకొచ్చారు. అప్పుడప్పుడు పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తూ యూత్ను కూడా ఎట్రాక్ట్ చేస్తూ వచ్చారు. జబర్దస్త్ షో బ్లాక్బస్టర్ కావడానికి అనసూయ గ్లామర్ షో కూడా ఉపకరించిందనేది నిజం.
ఆ షోతో వచ్చిన పాపులారిటీ సినిమా అవకాశాల్ని కూడా తీసుకు వచ్చింది. 'రంగస్థలం', 'క్షణం' లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఇటీవల డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన 'థ్యాంక్ యు బ్రదర్' సినిమాలో ఓ యువకుడితో పాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రెగ్నెంట్ లేడీగా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా 'పుష్ప'లో ఆమె ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
Also Read