సాయితేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
on Sep 16, 2021
మెగా హీరో సాయితేజ్ కు ఈ నెల 10న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా సాయితేజ్ ను ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 'పుష్ప' షూటింగ్ పూర్తి చేసి తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు అల్లు అర్జున్. తన సమీప బంధువైన సాయితేజ్ ప్రమాదానికి గురి కావడంతో.. గురువారం సాయంత్రం ఆయన అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయితేజ్ను పరామర్శించారు. అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన బన్నీ.. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆరోగ్యం మరింత మెరుగుపడిందని అపోలో వైద్యులు బన్నీకి తెలిపారు.
కాగా, సాయితేజ్ ని పరామర్శించడానికి అపోలో ఆసుపత్రికి వెళ్ళిన బన్నీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.