అజిత్ పదో పొంగల్ చిత్రంగా `వలిమై`!
on Sep 22, 2021
కోలీవుడ్ స్టార్ అజిత్ కి అచ్చొచ్చిన సీజన్స్ లో పొంగల్ ఒకటి. `వాన్ మతి`(96), `నేశమ్` (97), `తొడరుమ్` (99), `దీనా` (2001), `రెడ్` (2002), `పరమశివన్` (2006), `అల్వార్` (2007), `వీరమ్` (2014), `విశ్వాసమ్` (2019).. ఇలా ఇప్పటివరకు తొమ్మిదిసార్లు పొంగల్ బరిలో సందడి చేశారు అజిత్. వీటిలో `వాన్ మతి`, `దీనా`, `వీరమ్`, `విశ్వాసమ్` చిత్రాలు అజిత్ కెరీర్ లో మంచి విజయాలుగా నమోదయ్యాయి.
కట్ చేస్తే.. ఇప్పుడిదే సీజన్ లో పదోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అజిత్. ఆ వివరాల్లోకి వెళితే.. `నేర్కొండ పార్వై` వంటి విజయవంతమైన చిత్రం తరువాత హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన సినిమా `వలిమై`. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయికగా నటించింది. కాగా, 2021 దీపావళి లేదా క్రిస్మస్ కి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, 2022 పొంగల్ కి సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత బోనీ కపూర్ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మరి.. లక్కీ సీజన్ లో వస్తున్న `వలిమై`తో అజిత్ మరో మెమరబుల్ హిట్ ని సొంతం చేసుకుంటారేమో చూడాలి.
Also Read