ఆమె కళ్లముందే శ్వాస అందక కొవిడ్తో సోదరుడు మృతి
on May 4, 2021
'రంగం' నటిగా ఫేమస్ అయిన పియా బాజ్పేయి సోదరుడు కొవిడ్-19తో పోరాడుతూ మంగళవారం మృతి చెందాడు. తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న పియా ఈ హార్ట్బ్రేకింగ్ న్యూస్ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. అంతకుముందు ఆమె తన సోదరుడు చనిపోయే స్థితిలో ఉన్నాడనీ, అర్జంట్గా హాస్పిటల్లో బెడ్, వెంటిలేటర్ కావాలనీ, దీనికి సాయం చేయాలనీ అర్థిస్తూ వచ్చింది.
చివరగా ఆమె కొద్దిసేపటి క్రితం "నా బ్రదర్ ఇకలేడు." అని ట్వీట్ చేసింది. దానికి ముందు, ఉత్తరప్రదేశ్లోని ఫరుఖాబాద్లో కొవిడ్తో పోరాడుతున్న తన సోదరుడ్ని బతికించడానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ వరుసగా ట్వీట్స్ చేస్తూ వచ్చింది పియా. అతను మృతి చెందడానికి కొద్ది గంటల ముందు, "యూపీలోని ఫరూఖాబాద్ జిల్లా కాయమ్గంజ్ బ్లాక్లో వెంటిలేటర్తో ఓ బెడ్ అర్జంట్గా కావాలి. నా బ్రదర్ చచ్చిపోతున్నాడు. ఏదైనా తెలిస్తే దయచేసి హెల్ప్ చేయండి. Plz Contact if u know anybody -9415191852 Abhishek.. మేం ఇప్పటికే గందరగోళంలో ఉన్నాం." అని ఆమె ట్వీట్ చేసింది.
ఈ విషయంలో ఆమె స్థానిక బీజేపీ నాయకుడు తాజిండర్ పాల్ సింగ్ బగ్గాను కూడా సంప్రదించింది. ఆయన కూడా తనకు కాల్ చేశాడని ఆమె తెలిపింది. ఏదేమైనా కొవిడ్తో పోరాడుతూ ఆమె కళ్లముందే సోదరుడు చివరి శ్వాస విడవడం బాధాకరం.
పియా బాజ్పేయి తెలుగులో 'బ్యాక్బెంచ్ స్టూడెంట్', 'దళం' సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కె.వి. ఆనంద్ సినిమా రంగంలో చేసిన సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దురదృష్టవశాత్తూ ఇటీవలే కె.వి. ఆనంద్ కొవిడ్తో కన్నుమూశారు.