'మిస్ ఇండియా' రేసు నుంచి తప్పుకున్న 'శివాని రాజశేఖర్'
on Jun 29, 2022
సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'అద్భుతం', 'WWW' వంటి సినిమాలతో అలరించిన ఆమె.. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మిస్ ఇండియా రేసులో నిలిచిన శివాని తాజాగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చింది.
'ఫెమినా మిస్ ఇండియా-2022' పోటీల్లో తమిళనాడు తరపున బరిలో నిలిచిన శివాని రాజశేఖర్ అనారోగ్య సమస్యల కారణంగా తప్పుకున్నట్లు తాజాగా నిర్వాహకులు ప్రకటించారు. శివాని కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఓ వైపు ఎగ్జామ్స్, మరోవైపు మలేరియా కారణంగా తాను ట్రైనింగ్ సెషన్స్ కి హాజరు కాలేకపోయానని.. ఫెమినా మిస్ ఇండియా ప్రయాణంలో ఇక తాను భాగం కాదని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ శివాని చెప్పుకొచ్చింది.
దీంతో శివాని త్వరగా కోలుకోవాలని, వచ్చే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో మళ్ళీ పాల్గొనాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.