ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రెజీనా, నివేదా చిత్రం
on May 4, 2021
చెన్నైపొన్ను రెజీనా, కేరళకుట్టి నివేదా థామస్ ఓ ఫిమేల్ సెంట్రిక్ మల్టిస్టారర్ లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. `స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్స్` ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయ్యింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసిందట యూనిట్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. `శాకినీ - ఢాకినీ`. నాయికల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. అందుకు తగ్గట్టు ఉండే ఆ పాత్రల పేర్లనే సినిమాకి శీర్షికగా ఖరారు చేశారని సమాచారం. త్వరలోనే టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో `శాకినీ - ఢాకినీ` తెరపైకి రానున్నది.
కాగా, ఇటీవల విడుదలైన `వకీల్ సాబ్`తో నటిగా నివేదా మరోసారి తన సత్తా చాటగా.. తమిళ చిత్రం `నెంజమ్ మరప్పదిల్లై`తో రెజీనా కూడా మరోసారి తనదైన అభినయంతో ఇంప్రెస్ చేసింది.
Also Read