నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం.. ఎన్టీఆర్ భావోద్వేగం!
on Oct 12, 2021
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. మహేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు మహేష్ కోనేరు వ్యక్తిగత పీఆర్గా పనిచేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 118, తిమ్మరుసు, మిస్ ఇండియా సినిమాలను నిర్మించారు. సభకు నమస్కారం, పోలీసు వారి హెచ్చరిక వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. టాలీవుడ్ లో నిర్మాతగా రాణిస్తున్న ఆయన ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూసారు.
మహేష్ కోనేరు మృతి పట్ల ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహేష్ కోనేరు మృతి వార్త తెలిసి షాక్ కు గురయ్యానని, నమ్మలేకపోతున్నానని తెలిపారు. "బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. మహేష్ కుటుంసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని ట్వీట్ చేశారు.
Also Read