సినీ నటి పాయల్ పై యాసిడ్ దాడికి యత్నం!
on Sep 21, 2021
సినీ నటి పాయల్ ఘోష్ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ముంబైలో నివసిస్తున్న పాయల్.. మెడికల్ స్టోర్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని తెలిపింది. కారు ఎక్కుతున్న సమయంలో ఐరన్ రాడ్డుతో దాడి చేశారని.. చేతికి గాయాలయ్యాయని చెప్పింది. వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయని.. భయంతో సాయం కోరుతూ గట్టిగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించింది. ఆ దాడి ఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోందని.. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉందని పేర్కొంది. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలుపుతూ.. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
కాగా, పాయల్ ఘోష్ 'ప్రయాణం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. 'ఊసరవెల్లి'తో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో ఈమె.. పలు హిందీ సినిమాల్లోనూ నటించింది.
Also Read