పవన్తో ఆ ముగ్గురు `కేరళకుట్టి`ల్లో ఎవరో ఒకరు?
on May 5, 2021
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నారు పవన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇందులో రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేశ్ కన్ఫామ్ కాగా.. పవన్ కి జంటగా నటించే నాయిక ఎవరన్న విషయంపై క్లారిటీ రాలేదు. తొలుత ఈ పాత్ర కోసం సాయిపల్లవి పేరు వినిపించినా.. కాల్షీట్ల సమస్య కారణంగా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో.. కేరళకుట్టి నిత్యా మీనన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఇంకా నిత్య కన్ఫామ్ కాలేదట. నిత్యతో పాటు కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ఈ ముగ్గురు `కేరళకుట్టి`ల్లో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని బజ్. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా శక్తిమంతంగా ఉంటుంది కాబట్టే జనాలకి బాగా తెలిసిన నాయికవైపే యూనిట్ మొగ్గు చూపిస్తోందట.
మరి.. చివరాఖరికి పవన్ కి జోడీగా ఏ కేరళకుట్టి ఎంపికవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.