వన్స్ మోర్.. హిట్ పెయిర్స్!
on Jun 29, 2022
తెలుగునాట ప్రస్తుతం కొన్ని హిట్ పెయిర్స్.. వన్స్ మోర్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆ జంటల వివరాల్లోకి వెళితే..
చిరంజీవి - తమన్నాః
`సైరా నరసింహారెడ్డి` (2019)లో జంటగా అలరించిన చిరంజీవి - తమన్నా.. ప్రస్తుతం `భోళా శంకర్`లో మరోసారి జతకట్టారు. 2023 ప్రథమార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ వినోదాలు పంచనుంది.
మహేశ్ బాబు - పూజా హెగ్డేః
`మహర్షి`(2019)లో జంటగా నటించి చూపరులకు కనువిందు చేశారు మహేశ్ బాబు, పూజా హెగ్డే. కట్ చేస్తే.. ఈ హిట్ కాంబినేషన్ త్రివిక్రమ్ డైరెక్టోరియల్ కోసం ఇంకోసారి జట్టుకట్టింది. 2023 వేసవిలో ఈ సినిమా తెరపైకి రానుంది.
అల్లు అర్జున్ - రష్మికః
`పుష్ప - ద రైజ్` (2021) కోసం తొలిసారిగా జోడీకట్టారు అల్లు అర్జున్, రష్మికా మందన్న. మళ్ళీ ఇప్పుడు రెండో భాగం `పుష్ప - ద రూల్`లో కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ రిలీజ్ కానుంది.
నాగచైతన్య - రాశీ ఖన్నాః
ఆ మధ్య `వెంకిమామ` (2019)లో ఆడిపాడిన నాగచైతన్య - రాశీఖన్నా.. `థాంక్ యూ`లో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జూలై 22న ఈ సినిమా రిలీజ్ కానుంది.
నాగచైతన్య - కృతి శెట్టిః
ఈ ఏడాది సంక్రాంతి విజేత `బంగార్రాజు`లో జంటగా వినోదాలు పంచారు నాగచైతన్య - కృతి శెట్టి. ప్రస్తుతం ఈ ఇద్దరు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఓ ద్విభాషా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. 2023లో ఈ సినిమా విడుదల కానుంది.
నాని - కీర్తి సురేశ్ః
`నేను లోకల్` (2017)తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాని, కీర్తి సురేశ్.. ఐదేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు `దసరా` కోసం కలిసి నటిస్తున్నారు. ఇదే సంవత్సరం ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే అవకాశముంది.
విజయ్ దేవరకొండ - సమంతః
`మహానటి` (2018)లో సహాయక పాత్రల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ - సమంత.. ప్రస్తుతం `ఖుషి` కోసం జోడీ కట్టారు. డిసెంబర్ 23న ఈ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానుంది.
Also Read