'లైగర్'లో మైక్ టైసన్.. వెండితెరపై సందడి చేయనున్న లెజెండ్!
on Sep 27, 2021
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ 'మైక్ టైసన్' వెండితెరపై సందడి చేయబోతున్నారు. అది కూడా ఆయన తెలుగు సినిమాలో నటించనుండటం విశేషం. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
'లైగర్' మూవీలో మైక్ టైసన్ నటిస్తున్న విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమా ద్వారా ఇండియన్ స్ర్కీన్ కు పరిచయం కాబోతోన్నారు అని తెలిపింది. "మైక్ టైసన్ గారిని లైగర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో జర్నీ ప్రారంభించబోతున్నాం." అని విజయ్ ట్వీట్ చేశారు.
ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న పాన్ ఇండియా సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.