'వరుడు కావలెను' నుంచి బ్యూటిఫుల్ సాంగ్!
on Sep 22, 2021
నాగ శౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వరుడు కావలెను'. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన 'కోల కళ్ళే ఇలా', 'దిగు దిగు దిగు నాగ' సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
"మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ.. పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా" అంటూ సాగే ఈ పాటకు ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ పాటని గాయని చిన్మయి ఆలరించారు. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. సంగీత ప్రియుల్ని ఈ పాట కట్టిపడేస్తుంది అనడంతో సందేహం లేదు.
ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నానని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. ప్రేక్షకులకు,సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను అన్నారు.