కొరటాల శివ నిర్మాతగా మహేష్ సినిమా!!
on Jul 22, 2019
మహేష్ 27 వ సినిమా గురించి ఓ న్యూస్ ప్రజంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. `గీత గోవిందం` చిత్ర దర్శకుడు పరశురామ్ , మహేష్ కోసం ఓ స్టోరి రెడీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఆ స్టోరి మహేష్ కి చెప్పడం మహేష్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిపోయాయట.అయితే మరో ఆసక్తికరమైన న్యూస్ ఎంటంటే..ఈ సినిమాను హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ నిర్మిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఇక ప్రజంట్ మహేష్ `సరిలేరు నీకెవ్వరు` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కశ్మీర్ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 26 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. అనుకున్న ప్రకారం జరిగితే మహేష్ `సరిలేరు నీకెవ్వరు` తర్వాత పరశురామ్ దర్శకత్వంలో కొరటాల నిర్మాణంలో సినిమా చేసే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది.
Also Read