'కేరింత'లో మాయ చేయనున్న అవంతిక
on Sep 2, 2014
దిల్ రాజు నిర్మాత గా అంతా కొత్త వాళ్లతో నిర్మిస్తున్న చిత్రం 'కేరింత'. వినాయకుడు ఫేం సాయికిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, లావణ్య త్రిపాటి మెయిన్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీలో గ్లామరస్ మాయ చేయడానికి నీలకంఠ 'మాయ'లో చేసిన అవంతికను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. కేరింతలో ఈ ముద్దుగుమ్మ ఎన్నారై గర్ల్ గా పూర్తి గ్లామరస్ పాత్రలో నటించనుందట. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాను౦ది.