'వలిమై'.. స్టోరీలైన్ అదేనా!
on Oct 14, 2021
కోలీవుడ్ స్టార్ అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం `వలిమై`. `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో `నేర్కొండ పార్వై` వంటి బ్లాక్ బస్టర్ తరువాత అజిత్ చేస్తున్న ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పొంగల్ స్పెషల్ గా 2022 జనవరి 14న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `వలిమై` స్టోరీలైన్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారితే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా స్టోరీలైన్ అట. బైక్ రేస్ ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శత్రువులుగా మారే బెస్ట్ ఫ్రెండ్స్ గా అజిత్, కార్తికేయ కనిపిస్తారని.. ఇద్దరు కూడా పోటీపడి నటించారని బజ్. అంతేకాదు.. ఈ సినిమాతో కార్తికేయకి విలన్ గా మంచి గుర్తింపు దక్కుతుందని ఇన్ సైడ్ టాక్. మరి.. నాని `గ్యాంగ్ లీడర్`లో తనదైన విలనిజంతో అలరించిన కార్తికేయ.. `వలిమై`తో మరో స్థాయిలో ఆకట్టుకుంటాడేమో చూడాలి.
Also Read